Site icon TeluguMirchi.com

ఈ నెల 20 న జగన్ ను కలవబోతున్న చిరంజీవి

తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వివరించబోతున్న టాలీవుడ్ పెద్దలు. గత కొద్దీ రోజులుగా జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తుండగా..ఇప్పుడు అపాయింట్‌మెంట్ దొరికేసింది. ఈ నెల 20 న చిత్ర సీమా పెద్దలైనా చిరంజీవి నేతృత్వంలో హీరో నాగార్జున, నిర్మాతలు దిల్‌ రాజు, దగ్గుబాటి సురేశ్‌బాబు తదితరులు కలవనున్నారు. చిరంజీవి నేతృత్వంలోని బృందం ప్రభుత్వానికి సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ద్వారా కబురుపంపింది. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించుకుంటామంటూ చిరంజీవి కోరుతున్నారంటూ ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి పేర్ని నాని వివరించారు.

Exit mobile version