Site icon TeluguMirchi.com

‘టీఎస్ఆర్’ అవార్డ్స్ వేడుక లో చిరుకు చేదు అనుభవం..

ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే టీఎస్ఆర్ అవార్డ్స్ వేడుక ఈ ఏడాది కూడా గ్రాండ్ గా జరిగింది. ఆదివారం వైజాగ్ లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి , బాలకృష్ణ , మోహన్ బాబు , నాగార్జున రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో చిరు రెండు అవార్డ్స్ అందుకున్నాడు. కాకపోతే ఈ అవార్డ్స్ ఆయనకు వచ్చినవి కాదు..తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వచ్చినవి. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం తో బిజీ గా ఉండడం తో ఆ అవార్డ్స్ చిరు అందుకున్నాడు. ఈ వేడుకలో తనకు ఒక అవార్డు కూడా రాకపోయేసరికి కాస్త ఫీల్ అయినట్లు తెలిపాడు.

2017 ఏడాదికి గానూ.. మోస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొడ్యుసర్ (ఖైదీ నెం.150), 2018 ఏడాదికి గానూ.. బెస్ట్ హీరో (రంగస్థలం) కేటగిరీల్లో రామ్ చరణ్‌ను అవార్డులు వరించాయి. ఈ అవార్డుల్ని అందుకున్న చిరంజీవి సుబ్బిరామిరెడ్డిపైన తన తోటి నటీనటులపైన ప్రశంసల జల్లు కురిపించారు.

మెగాస్టార్ మాట్లాడుతూ.. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అవార్డులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. టీఎస్ఆర్ అవార్డుల్ని ఇన్ని ఏళ్లుగా సుబ్బిరామిరెడ్డి గారు నిర్వహించడానికి ఆయనకి శక్తి ఎక్కడ నుండి వస్తుందో తెలియడం లేదు. ఆయనకు కళలు అంటే అంత ఇష్టం. అందుకే ఈరోజు నేను బాలక్రిష్ణ, నేను, నాగార్జున, మోహన్ బాబు అందరం మొక్కుబడిగా కాకుండా ఇష్టంతో ఇక్కడకు వచ్చాం. మేం అంతా అన్నదమ్ములం అనే విషయాన్ని సుబ్బిరామిరెడ్డిగారు గుర్తు చేస్తుంటారు. మా అందర్నీ ఒకే వేదికపైకి తీసుకురావడం ఒక్క సుబ్బిరామిరెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది.

ఈ కార్యక్రమంలో నాగార్జునకి అవార్డు వచ్చింది.. బాలక్రిష్ణగారికి అవార్డు వచ్చింది.. మోహన్ బాబుకి అవార్డ్‌ వచ్చింది నాకే ఏ అవార్డు రాలేదు. ఈరోజు నేను తీసుకున్న అవార్డు రామ్ చరణ్‌ది ఒకటి హీరోగా. రెండోది నిర్మాతగా. రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుకలో ఒక మాట అన్నాను. రంగస్థలం సినిమా చూసిన తరువాత చరణ్ పెర్ఫామెన్స్ చూసి తండ్రిగా గర్వపడుతున్నాను. నటుడిగా ఈర్శ్య పడుతున్నాను అన్నాను. ఇప్పుడు ఆ సినిమాకి అవార్డు రావడం పుత్రోత్సాహాన్ని ఆనందిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Exit mobile version