కరోనా బారినపడిన పోసాని..

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుముఖం పట్టడడం తో మళ్లీ సాధారణ రోజులయ్యాయి. చాలామంది మాస్క్ లు ధరించడం కానీ , సామజిక దూరం పాటించడం కానీ చేయడం లేదు. దీంతో మళ్లీ కరోనా బుసలు కొట్టడం స్టార్ట్ చేసింది. హైదరాబాద్ లో వారం రోజులుగా కేసులు పెరుగుతున్నట్లు డాక్టర్స్ చెపుతున్నారు. ఇదిలా ఉంటె కరోనా మహమ్మారికి చిత్ర సీమా ఆర్థికంగానే కాక ఎంతోమంది సినీ ప్రముఖులను కోల్పోయింది. తాజాగా ప్రముఖ రైటర్ . దర్శకులు, నటుడు పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు.

తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన పోసాని… తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు.