Site icon TeluguMirchi.com

కరోనా బారినపడిన సన్నీ డియోల్‌

దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. మొదటితో పోలిస్తే భారీగా కేసులు , మరణాలు తగ్గినప్పటికీ..కరోనా ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ మహమ్మారి బారిన అనేక మంది సినీ , రాజకీయ నేతలు పడగా..తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ సినీనటుడు, గురుదాస్‌ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌ కరోనా బారిన పడ్డారు.

హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉంటున్న సన్నీ డియోల్ కు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని హిమాచల్‌ ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్‌ అవస్థీ చెప్పారు. ఎంపీ సన్నీడియోల్‌, అతని స్నేహితులు కుల్లూ జిల్లా నుంచి ముంబైకి వెళ్లాలనుకున్నారు. కానీ సన్నీడియోల్‌ కరోనా పరీక్ష చేయించుకోగా అతనికి పాజిటివ్‌ అని తేలిందని ఆరోగ్య కార్యదర్శి చెప్పారు.

Exit mobile version