పవన్ చిత్రానికి అప్పుడే భారీ ఆఫర్ తలుపుతట్టింది..

పవన్ కళ్యాణ్ – రానా ల కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..త్రివిక్రమ్ మాటలు అందించడం విశేషం. మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో పవన్‌కి జంటగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానాకి జంటగా మరో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగానే సినిమాకు భారీ ఆఫర్లు వస్తున్నాయట. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాతలు భారీ ఆఫర్ ఇచ్చారట. దాదాపు 23 కోట్లకు ఈ మూవీ రైట్స్ కొనుగోలు చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ మాత్రం మేకర్స్ నుంచి రాలేదు.