విడిపోతున్న ధనుష్-ఐశ్వర్య..

చిత్రసీమలో మరో సినీ జంట విడిపోతున్నారు. గత ఏడాది అక్కినేని నాగ చైతన్య – సమంతలు విడిపోయి షాక్ ఇవ్వగా..ఇప్పుడు వీరి బాటలోనే మరో సినీ జంట తమ విడాకులు ప్రకటించారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

2004లో పెళ్లి చేసుకున్న ఈ జంట కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి విడాకులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గత 18 ఏళ్ల నుంచి స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రయాణం కొనసాగించామని… కానీ ఇప్పుడు వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యామని హీరో ధనుష్ ఓ లేఖ ద్వారా వివరించాడు.