ప్రముఖ దర్శకుడు కే. విశ్వనాధ్ కన్నుమూత


తెలుగు సినిమా పరిశ్రమలో సుప్రసిద్ధ దర్శకుడు కళాతపస్వి కే. విశ్వనాధ్ కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజు అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. శంకరాబరణం, శుబసంకల్పం, స్వయంకృషి, సాగర సంగమం, సిరివెన్నెల, ఆపద్భాందవుడు , శుభలేఖ, శుభసంకల్పం వంటి చరిత్రలో నిలచి పోయే సినిమాలెన్నో తీశారు కే. విశ్వనాధ్. వారి అకాల మరణం నిజంగా తెలుగు చిత్ర సీమకు తీరని లోటు అనే చెప్పాలి. విశ్వనాధ్ గారి మరణం విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం ప్రకటిస్తున్నారు.