గాంధీ, గాడ్సేలు ఎదురుగా నిలబడితే జరిగే మాటల యుద్ధం, సిద్ధాంతాల పోరాటం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నమే ‘గాంధీ గాడ్సే ఏక్ యుద్ధ్’ మూవీని దర్శక, నిర్మాతలు అంటున్నారు. ప్రముఖ దర్శకుడు రాజ్కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ మూవీని పీవీఆర్ పిక్చర్స్ సమర్పిస్తోంది.ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. గాంధీగా దీపక్ అంతాని, నాథూరామ్ గాడ్సేగా చిన్మయ్ మందేల్కర్ నటించారు. కాగా ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదలచేస్తున్నట్లు ప్రచారచిత్రం విడుదల చేసింది చిత్ర యూనిట్.