ఓటిటి బాట పట్టిన అలియా భట్ చిత్రం

లాక్డౌన్ అనంతరం థియేటర్లు తిరిగి తెరవడంతో, బాలీవుడ్ రాబోయే నెలల్లో థియేట్రికల్ రిలీజ్ కోసం పెద్ద చిత్రాల కోసం రిలీజ్ డేట్స్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో , ఇప్పుడు పలు చిత్రాలు వాయిదా పడుతున్నాయి, మరికొన్ని ఓటిటి బాట పట్టాయి. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ కథానాయికగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూభాయ్ కతియావాడి’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసే యోచన చేస్తున్నారట. వాస్తవానికి జులై 30న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే, కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.