అలిమేలుమంగ కోసం ద్విపాత్రాభినయం లో గోపీచంద్

గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వెంకటరమణ’ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ కోసం రామోజీ ఫిలిం సిటీ లో సెట్ వేస్తున్నారు. ఇందులో గోపీచంద్ కవలలుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటించే అవకాశం వుంది. ఈ సినిమాను డైరెక్టర్ తేజ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నాడని టాక్. ప్రస్తుతం గోపీచంద్ సీటిమార్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు, మరో వైపు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో పక్క కమర్షియల్ అని మరొక సినిమా చేస్తున్నాడు.