Site icon TeluguMirchi.com

అలిమేలుమంగ కోసం ద్విపాత్రాభినయం లో గోపీచంద్

గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వెంకటరమణ’ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ కోసం రామోజీ ఫిలిం సిటీ లో సెట్ వేస్తున్నారు. ఇందులో గోపీచంద్ కవలలుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటించే అవకాశం వుంది. ఈ సినిమాను డైరెక్టర్ తేజ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నాడని టాక్. ప్రస్తుతం గోపీచంద్ సీటిమార్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు, మరో వైపు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో పక్క కమర్షియల్ అని మరొక సినిమా చేస్తున్నాడు.

Exit mobile version