సెన్సార్ పూర్తి చేసుకున్న గ‌ల్లీ రౌడీ

వెర్సటైల్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ స్టార్ సందీప్ కిష‌న్ టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం ‘గ‌ల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాతగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ కి జోడీగా నేహాశెట్టి నటిస్తుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహ, పోసాని, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని ఆగష్టు లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.