వచ్చే నెలలో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్

పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో సూర్య మూవీస్ బ్యానర్ ఫై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ మొదలు పెట్టి చాల రోజులే అవుతున్నప్పటికీ..ఇంకా పూర్తి కాలేదు. మధ్య లో కరోనా రావడం..అదే టైం లో పవన్ భీమ్లా నాయక్ స్టార్ట్ కావడం తో హరిహర వీరమల్లు ఆలా ఉండిపోయింది.

ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ డిసెంబర్ నుంచి మొదలవనుందని తాజా సమాచారం. ఈ సినిమా కోసం చిత్రబృందం ఇటీవలే కొత్త లొకేషన్స్‌ను ఫైనల్ చేసింది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాం పాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.