సాయి పల్లవికి హై కోర్ట్ షాక్


వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ప్రముఖ సినీ నటి సాయి పల్లవికి హై కోర్ట్ లో షాక్ తగిలినట్టైంది. విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో పాటు గోరక్షకుల పై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ హైదరాబాద్‌ సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు భజరంగ్‌దళ్‌ నాయకులు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే భజరంగ్‌దళ్‌ నాయకుల ఫిర్యాదు పై న్యాయ సలహా తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు సాయిపల్లవికి గత నెల 21న నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ సాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయి పల్లవి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.