దేశం లో కొత్తగా 259170 కరోనా కేసులు, 1761 మరణాలు

దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది, కొన్ని రోజులుగా రోజువారీ కేసులు 2 లక్షలు దాటుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 1,53,21,089 కేసులు నమోదు కాగా, ఇందులో 1,31,08,582 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 20,31,977 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనాతో 1,761మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,80,530 కి చేరింది. దేశ వ్యాప్తంగా ఈ రోజు 1,54,761 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు.