Site icon TeluguMirchi.com

మహేశ్ సినిమా నుంచి తప్పుకున్న జగపతి బాబు

 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి పలువురు స్టార్ నటీ నటుల్ని తీసుకున్నవిషయం తెలిసిందే. అయితే  వారిలో విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు ఉన్నారు. వీరిలో జగపతిబాబు సినిమా నుండి బయటికొచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అదేమంటే… ఆయన సినిమా నుండి వెళ్లిపోవడానికి గల కారణాలు ఏమిటనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈయన స్థానంలో మరొక నటుడు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారని టాక్ నడుస్తోంది.  ప్రస్తుతం కాశ్మీర్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాతి కానుకగా విడుదల కానుంది.

Exit mobile version