Site icon TeluguMirchi.com

కొత్తదనం ఏది కార్తికేయ ?

ఆర్ ఎక్స్ 100 తో ఆకట్టుకున్న కార్తికేయ హిప్పీతో ఫ్లాఫ్ తిన్నాడు. మొన్న వచ్చిన ఆ సినిమా పెద్ద తలనొప్పిగా మారింది. సినిమా చూసిన జనాలు తలలు పట్టుకున్నారు. ఇదేం జండూబాంబ్ సినిమా అనుకున్నారు. టోటల్ గా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది హిప్పీ. ఇప్పుడు కార్తికేయ ‘గుణ 369 అనే సినిమా చేస్తున్నాడు. అర్జున్‌ జంద్యాల దర్శకత్వం అనగా కథానాయిక.

ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ నీ పక్కనోళ్ల జీవితానికి ఏ హానీ జరగకూడదు’ అని సాయి కుమార్‌ చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ‘మాలాంటి వాళ్లు మీ లాంటి వాళ్లని చూసి భయపడేది మాకేదన్నా అవుతుందని కాదు. మా అనుకున్నవాళ్లకి ఏదన్నా అవుతుందన్న చిన్న భయంతో’ అంటూ చివర్లో కార్తికేయ చెప్పిన డైలాగ్‌ ఎమోషన్ గా వుంది. ఐతే ఈ టీజర్ లో కొత్తదనం ఏమీ కనిపించకపోవడం విమర్శకు తావిచ్చింది.

Exit mobile version