పాన్ ఇండియా టాలీవుడ్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే ఆది పురుష్ సినిమా షూటింగ్ను పూర్తి చేసిన ప్రభాస్.. ఓ వైపు సలార్.. మరో వైపు ప్రాజెక్ట్ K చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే ప్రభాస్ కోసం మరో రెండు క్రేజీ సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. ఒకటేమో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా.. మరోటేమో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న మూవీ స్పిరిట్.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా నటించడానికి సందీప్ రెడ్డి కరీనా కపూర్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ కరీనా ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటే, అది ఆమె తెలుగులో కూడా అరంగేట్రం అవుతుంది. ప్రస్తుతానికి, ప్రభాస్ ప్రాజెక్ట్ కే తో బిజీగా ఉన్నారు మరియు కరీనా కపూర్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం తన తొలి వెబ్ సిరీస్ షూటింగ్లో ఉన్నారు.