వెంకన్నను దర్శనం చేసుకున్న కార్తికేయ దంపతులు

RX100 ఫేమ్ కార్తికేయ తాజాగా పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. తాను ఎంతో అభిమానించే.. ఇష్టపడే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా కార్తికేయ పెళ్లి జరింది. చిరంజీవి రావడంతో కార్తికేయ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

పెళ్లి తర్వాత భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. పెళ్లి తంతు అంతా ముగిసింది. దాంతో కార్తికేయ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు కొందరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభం సమయంలో దర్శణంను కల్పించారు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు కార్తికేయ దంపతులను స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.