కరోనా నుండి బయటపడ్డ కీర్తి సురేష్‌

రీసెంట్ గా కరోనా బారినపడిన కీర్తి సురేష్..క్షేమంగా కరోనా నుండి బయటపడింది. దాదాపు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న కీర్తి తాజాగా కరోనా నుంచి కోలుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ రోజుల్లో ‘నెగెటివ్’ అంటే పాజిటివ్ విషయం. నాపై మీ అందరు చూపించిన ప్రేమ, ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అందరూ సంక్రాంతి పండగ రోజులను ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్న కీర్తి సురేష్.. క్వారంటైన్ తర్వాత తన లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేసింది.

ఇక సినిమాల విషయానికి వస్తే …ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట మూవీ చేస్తుంది కీర్తి. ఇందులో మహేష్ హీరోగా నటిస్తుండగా..మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.