కల్కి విరచిత ‘పొన్నియిన్ సెల్వన్’ నవల పుస్తక ప్రియులతో పాటు సినీ జనాలకు బాగా ఇష్టం. ఈ నవల ఆధారంగా రూపొందే చిత్రంలో నటించాలని ఎంతో మంది హీరోలు అనుకున్నారు. ఎంతో మందికి కలల చిత్రంగా మిగిలిపోయిన ఈ సినిమాను మణిరత్నం తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ విక్రం, కార్తి, జయంరవి, విక్రంప్రభు ఇలా పెద్ద తారాగణంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
అయితే మొదట ఈ సినిమాలో కీర్తి సురేష్ ని తీసుకునారు. అయితే కీర్తి ఈ సినిమా నుంచి తప్పుకున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇందుకు కారణమేమిటంటే.. కీర్తి సురేశ్ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంతోపాటు తలైవా 168వ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు డేట్స్ కుదరకపోవడంతో ఆమె మణిరత్నం సినిమా నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.