సస్పెన్స్ థ్రిల్లర్ గా ఖిలాడీ టీజర్

క్రాక్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, ప్రస్తుతం పెన్ మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్ పై రమేష్ వర్మ డైరెక్షన్లో ఖిలాడీ మూవీ చేస్తున్నాడు. మే 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ మరియు ఫోటోలు విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.

తాజాగా ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా చేసుకుని, అన్ని ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. చివరి వరకూ ఎలాంటి డైలాగ్స్ లేకుండా, రవితేజ లైఫ్ లోని పరిణామాలపై కట్ చేసిన విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. విజువల్స్ కి తగినట్టుగా ఆర్ ఆర్ అదిరిపోయింది. ముఖ్యంగా టీజర్ లాస్ట్ లో రవితేజ ‘ఎమోషన్స్ లేనివాడిని ఎవరూ ఆపలేరు’ అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

కాగా ఈ చిత్రంలో ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తుండగా… మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. అర్జున్ సర్జ, ఉన్ని ముకుందన్ లు ‌ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ర‌వితేజ‌కు మంచి హిట్ అందించ‌డం ఖాయం అని అంటున్నారు మేక‌ర్స్ .