చరణ్ కు జోడి కియారానేనట

రామ్ చరణ్ – శంకర్ కలయికలో మూవీ ప్రకటన వచ్చి మెగా అభిమానుల్లో సంబరాలు నింపింది. ఈ మూవీ లో ఎవరెవరు నటిస్తున్నారని వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రానప్పటికీ, ఈ మూవీ లో హీరోయిన్ గా కియారా అద్వానీ ఖరారైనట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చరణ్ – కియారా కలయికలో వినయ విధేయ రామ చిత్రం వచ్చింది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.