మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం ఆచార్య విడుదలకి సిద్దంగా ఉంది. దాంతో పాటు చిరంజీవి పైప్లైన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన 153 వ చిత్రాన్ని దర్శకుడు మోహన్రాజాతో చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కనుంది. చిరంజీవి మాస్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు మోహన్రాజా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ని జోడించారు.
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్గుడ్ ఫిలింస్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ఆర్ బి చౌదరి మరియు ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు. అయితే ఈ చిత్రాన్ని ఆగష్టు 12 నుండి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారట, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం సెట్ పనులు శరవేగంగంగా జరుగుతున్నాయి.