సూపర్స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో,టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న భారీ,ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతోంది.
ఈ చిత్రంలో సూపర్స్టార్ మహేష్ బాబు సరసన పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కానుందని చిత్ర నిర్మాణ సంస్థ ఆఫీసియల్ గా ప్రకటించింది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన `అతడు`, `ఖలేజా` దశాబ్ద కాలానికి పైగా నేటికీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్లో మరో బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది అన్న వార్త అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది.
ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది (2023) వేసవి లో చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.