Site icon TeluguMirchi.com

తేజు ను పరామర్శించిన మోహన్ బాబు

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ ను మోహన్ బాబు పరామర్శించారు. కుమార్తె మంచు లక్ష్మితో కలిసి ఆపోలో ఆస్పత్రికి వెళ్లి సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత మోహన్ బాబు మాట్లాడుతూ.. ఆ సాయి బాబా ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి బయటకు వస్తారు అని చెప్పుకొచ్చారు.

ఇక అపోలో డాక్టర్స్ విడుదల చేసిన తేజ్ హెల్త్ బులిటిన్ లో ..‘సాయి ధరమ్ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇంకా కొన్ని రోజులు ఐసీయూలోనే ఉంచాల్సి ఉంది. వెంటిలేటర్ మద్దతుతో ప్రక్రియను తొలగించడం ప్రారంభించాం’ అని వైద్యులు తాజా హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.

Exit mobile version