మోహన్ బాబు వ్యాఖ్యలు బాలయ్య ను బాధపెట్టాయా..?

మా ఎన్నికల్లో బాలకృష్ణ …మంచు విష్ణు కు సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విష్ణు భారీ మెజార్టీ తో ప్రకాష్ రాజ్ ప్యానల్ ఫై విజయ డంఖా మోగించారు. ఈ తరుణంలో తన కొడుకు కు సపోర్ట్ గా నిలిచినా వారి ఇళ్లలకు వెళ్లి మోహన్ బాబు , విష్ణు లు థాంక్స్ చెపుతున్నారు. బాలయ్య ఇంటికి వెళ్లిన మోహన్ బాబు..అనంతరం మీడియా సమావేశం ఏర్పటు చేసారు.

తనకొడుకును గెలిపించినందుకు థ్యాంక్స్ చెప్పటాన్ని ఎవరూ ఏమీ అనరు. కానీ.. రాజకీయాల్ని లాక్కొచ్చి.. అలాంటి వాటిని పట్టించుకోకుండా తమకు సపోర్టు చేశారంటూ బాలయ్య మీద చేసిన వ్యాఖ్య.. ఇప్పుడాయన్ను ఇరుకున పెట్టేలా చేసిందంటున్నారు. బాలయ్య అల్లుడు లోకేశ్. మంగళగిరి బరిలో నిలిచిన లోకేశ్ ను ఓడించేందుకు తాము ప్రచారం చేశామని.. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా బాలయ్య మనసున్న వ్యక్తిలా వ్యవహరించారంటూ మోహన్ బాబు మాటల్ని టీడీపీ వర్గీయులు మొదలుకొని బాలయ్య అభిమానుల వరకు అందరూ నెగిటివ్ గా తీసుకోవటం ఖాయమన్న చర్చ సాగుతోంది. ఎప్పుడో ముగిసిన పురాణాన్ని ఇప్పుడు తట్టి రేపాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.