లవ్ స్టోరీ ని ప్రేమ్ నగర్ తో పోల్చిన నాగ్

నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ట్రైలర్ విడుదల చేసి ఆసక్తి నింపారు.

ఈ ట్రైలర్ చూసిన కింగ్ నాగార్జున.. ‘లవ్ స్టోరి’ చిత్రంలోని ఓ పోస్టర్‌ని.. తన తండ్రి, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమనగర్’ చిత్ర పోస్టర్‌తో పోల్చుతూ.. ట్విట్టర్ వేదికగా చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. 24, సెప్టెంబర్ 1971లో ‘ప్రేమనగర్’ చిత్రం విడుదలైతే.. 24, సెప్టెంబర్ 2021న చైతూ ‘లవ్ స్టోరి’ విడుదల కాబోతోంది అని తెలుపుతూ.. ‘‘ ‘లవ్ స్టోరి’ చూడడానికి చాలా బాగుందిరా ఛై.. ఆల్ ద బెస్ట్’’ అని కింగ్ నాగార్జున తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.