Site icon TeluguMirchi.com

ఇప్పుడు ఓదార్పు నాగబాబు వంతు అయ్యింది.

మొన్నటి వరకు వైస్ జగన్ ఓదార్పు యాత్ర చేసి వార్తల్లో నిలిస్తే..ఇప్పుడు జగన్ సీఎం కావడం తో ఆ ఓదార్పు యాత్ర నాగబాబు చేస్తున్నాడు. జనసేన పార్టీ తరుపున ఎంపీ గా పోటీ చేసి ఘోర ఓటమి చవిచూసిన నాగబాబు..తన యూట్యూబ్ ఛానల్ లో జన సైనికులను ఓదార్పు చేసే పని పెట్టుకున్నారు.

ఎన్నికలకు ముందు యూట్యూబ్ ఛానల్ ద్వారా టీడీపీ, వైసీపీపై దారుణమైన కామెంట్స్ చేస్తూ నానా హడావిడి చేసిన నాగబాబు ..ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. జనసేన ఓటమి పట్ల జనసైనికులు, వీరమహిళలు ఎవరూ బాధపడొద్దని .. ఇంకా భవిష్యత్తు ఉందని, రాబోయే రోజులన్నీ మనవే అంటూ ఊరించే ప్రయత్నం చేశారు. అవసరమైతే ఓ 2 నెలలు అలా విహారయాత్రకు వెళ్లి రమ్మని కూడా ఓ ఉచిత సలహా ఇచ్చాడు.. సలహా ఇచ్చే ముందు టీడీపీ పార్టీ కి కొమ్ముకాయకుండా ఉంటె బాగుండు కదా అని నెటిజన్లు రివర్స్ ఎటాక్ చేయడం మొదలు పెట్టారు.

Exit mobile version