పవన్ సెట్ లో జాయిన్ అయినా నిత్యా

పవన్ కళ్యాణ్ – రానా ల కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..త్రివిక్రమ్ మాటలు అందించడం విశేషం. మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్‌కి జంటగా నటిస్తున్న టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.కాగా రానాకి జంటగా మరో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించబోతోంది. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.