కొత్తగా భూమిని కొనుగోలు చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసారు. ఇందుకు గాను శనివారం ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రత్యక్షం అయ్యారు. ఎన్టీఆర్ రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లారు. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు గాను ఎన్టీఆర్ ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లి సంతకాలు పెట్టి.. ఫొటోలు దిగారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఎమ్మార్వో సహా అక్కడ ఆఫీస్ అధికారులు ఇతర సిబ్బంది ఎన్టీఆర్ తో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎన్టీఆర్ ఎమ్మార్వో ఆఫీస్ వచ్చారనే వార్త తెలుసుకొని పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని అభిమానులను కాస్త కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కొందరితో సెల్ఫీలు తీసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లి పోయారు.