Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భాంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి ఫ్యామిలీ నివాళ్లు

ఈరోజు నందమూరి తారకరామారావు 26 వ వర్ధంతి సందర్భాంగా నందమూరి కుటుంబ సభ్యులు , తెలుగుదేశం నేతలు , కార్య కర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు నివాళ్లు అర్పించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ అంజలి ఘటించి.. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్‌ నిలిచిపోయారన్న బాలకృష్ణ.. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ను మరచిపోలేరని పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మాట తప్పని ఎన్టీఆర్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమన్న బాలకృష్ణ.. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు.

అలాగే జూ. ఎన్టీఆర్ ట్విట్టర్ లో ‘తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ ధ్రువ తార మీరే’ అంటూ యన్టీఆర్ తన తాతను గుర్తుచేసుకున్నారు.

Exit mobile version