ఎన్టీఆర్ కు జోడిగా అలియా..?

ఎన్టీఆర్ – అలియా భట్ లు మరోసారి తెరపై కనిపించబోతున్నారా..అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ప్రస్తుతం వీరిద్దరూ ఆర్ఆర్ఆర్ మూవీ లో నటించారు. ఈ మూవీ లో ఆలియా యన్టీఆర్ తో నటించినప్పటికీ.. అందులో ఆమె రామ్ చరణ్ జోడీగా నటించింది కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్ కు బ్రేక్ పడింది. లేదంటే ఈ పాటికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఇదిలా ఉంటె..ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30 వ చిత్రం చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. అతి త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ మూవీ లో హీరోయిన్ గా అలియా భట్ ను అనుకుంటున్నారట. ముందుగా హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు వినిపించగా.. ఆ తర్వాత జాన్వీ కపూర్ పేరు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అలియా పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఆలియా భట్ కథానాయికగా నటిస్తోందనగానే సినిమాకి మరింతగా హైప్ క్రియేట్ అయింది.