ఎన్టీఆర్, కొరటాల మూవీ లో హీరోయిన్ గా బాలీవుడ్ భామ ?

ఉగాది సందర్భంగా ఎన్టీఆర్ 30వ చిత్రం ప్రకటన వెలుబడింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకోనుంది. సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 2022 ఏప్రిల్ 29న ఈ చిత్రం విడుదలకానుంది.

గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. కియారా ఇప్పటికే తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది.