Site icon TeluguMirchi.com

జగన్ భయం గురించి చెప్పిన పవన్ కళ్యాణ్


ప్రజలు 151 సీట్లతో అధికారం కట్టబెట్టినా వారి నమ్మకాన్ని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . తమపై కేసులు ఉండేవాళ్లు సమాజంలో బలంగా మాట్లాడలేరని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడతారన్నారు . జగ దిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రాజెక్టులపై బలంగా మాట్లాడలేకపోయారని..ఆయనకు సీబీఐ కేసుల భయం ఉందని విమర్సించారు పవన్.

గతంలో తెదేపా నేతలు చేస్తే ఇప్పుడు వైకాపా నేతలు చేస్తున్నారని.. దీనిలో పెద్దగా తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడిపేవారు హింసను ప్రోత్సహించకూడదన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు పురోగతి లేదని ప్రశ్నించారు పవన్.

Exit mobile version