క్వారంటైన్ లో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్వారంటైన్ కి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ముఖ్య కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డాక్టర్ల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ క్వారంటైన్ కి వెళ్లారు. డాక్టర్ల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారు. రోజు వారి విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది.