విజయ్ సరసన ఫస్ట్ ఛాన్స్ పూజాకే వచ్చిందట..కానీ

తమిళ్ హీరో విజయ్ ఫస్ట్ టైం తెలుగు లో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తన 66 వ చిత్రంగా ఇది తెరకెక్కబోతుంది. దీనికి సంబదించిన పూజా కార్య క్రమాలు రీసెంట్ గా చెన్నై లో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో విజయ్, హీరోయిన్ రష్మిక మందన్న, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

కాగా ఈ మూవీ లో ముందుగా హీరోయిన్ గా పూజా హగ్దే ను అనుకున్నాడట దిల్ రాజు. కానీ ప్రస్తుతం పూజా వరుస సినిమాలతో బిజీ గా ఉండడం తో కాల్ షీట్ అడ్జెస్ట్ చేయలేక నో చెప్పిందట. దాంతో రష్మిక ను తీసుకున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఇక విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బీస్ట్’ సినిమా ఈ నెల 13 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సన్ పిక్చర్ పతాకంపై కళానిది మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.