Site icon TeluguMirchi.com

మాస్క్’తో కనిపించిన ప్రభాస్ 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. భారత్ తో సహా 65 దేశాలకి ఈ మహమ్మారి వ్యాపించింది. తెలంగాణలోనూ కరోనా కేసులు నమోదవ్వడం కలవపరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్లేటప్పుడు మొహానికి మాక్స్ లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ సూచనని అమలు చేసి ఆదర్శంగా నిలిచారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

సినిమా షూటింగ్ కోసం ఈరోజు యూరప్ బయలుదేరిన ప్రభాస్ శంషాబాద్ వినామాశ్రయంలో మొహానికి మాక్స్ ధరించి కనిపించారు. చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూరప్ నేపథ్యంలో ఈ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది.

Exit mobile version