మరో వివాదంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ !


ఆదిపురుష్ చిత్రం వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది. గ‌తంలో అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఈ సినిమా తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకుంది. సెన్సార్ బోర్డు నుంచి స‌ర్టిఫికేట్ రాకుండానే సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేశారంటూ కుల‌దీప్ అనే వ్య‌క్తి అల‌హాబాద్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. సెన్సార్ నుంచి స‌ర్టిఫికేట్ రాకుండానే చిత్ర నిర్మాత ప్రోమోను విడ‌ద‌ల చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని పేర్కొంటూ కోర్టును ఆశ్ర‌యించాడు. సీతాదేవి పాత్ర‌లో న‌టించిన కృతిస‌న‌న్ ధ‌రించిన కాస్టుమ్స్ పై కూడా కుల‌దీప్ త‌న అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. పిల్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు, సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ బిఆర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిల్ విష‌యాన్ని చ‌ర్చించింది. పిల్ ను స్వీక‌రించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి 21కి వాయిదా వేసింది.

ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తున్న ఆదిపురుష్ సినిమాకు ఓం రావ‌త్ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. టీ సిరీస్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి షూటింగ్ చేస్తున్నారు. ప్ర‌భాస్ రాఘ‌వ పాత్ర చేయ‌నుండ‌గా, కృతిస‌న‌న్ జాన‌కి పాత్ర చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్ర పోషిస్తున్నాడు.