మొత్తానికి రాధేశ్యామ్‌ పూర్తిచేశారు

ప్రభాస్ – రాధాకృష్ణ కలయికలో పూజా హగ్దే హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్‌. ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుండి ఎన్నో అవాంతరాల మధ్య నడుస్తూ వచ్చింది. ఎట్టకేలకు నిన్నటితో సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టినట్లు చిత్ర దర్శకులు తెలిపారు. ‘‘రాధేశ్యామ్‌ చిత్రీకరణ పూర్తయింది. నా ప్రేమను డార్లింగ్‌ అభిమానులందరకీ పంచుతున్నాను. ముందు వేసుకున్న ప్రణాళికను కరోనా భారీగా దెబ్బతీసింది. మూడు రోజుల్లో స్పెషల్‌ అప్‌డేట్‌ వస్తుంది’’ అని ట్వీట్‌ చేశారు. 2018లో ప్రారంభమైన ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ కరోనాతో పలుమార్లు నిలిచిపోయింది. హిందీ వెర్షన్‌కు మిథున్‌-మనన్‌ భరద్వాజ్‌, దక్షిణాది భాషలకు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. భూషణ్‌కుమార్‌, వి. వంశీ, ప్రమోద్‌, ప్రసీదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.