అఖండ ప్రీ రిలీజ్ కు రాజమౌళి కూడా వస్తున్నాడు

బాలయ్య-బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా అఖండ. ఇంతకు ముందు ‘సింహా’, ‘లెజెండ్​’ చిత్రాలతో బ్లాక్​బస్టర్​లు కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల ఫై దృష్టి సారించిన చిత్ర యూనిట్..ఈరోజు హైదరాబాద్ లోని శిల్ప కళావేదిక లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ్హఇస్తున్నారు. ఈ ఈవెంట్ గా చీఫ్ గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు రాజమౌళి హాజరుకాబోతున్నారు.