సెట్లో నవ్వులు పూయిస్తున్న రాశి ఖన్నా

గోపీచంద్, రాశి ఖన్నా జంటగా డైరెక్టర్ మారుతీ మారుతీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పక్క కమర్షియల్. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రతి రోజు పండగే చిత్రంలో ఏంజెల్ ఆర్నా పాత్రలో నటించిన రాశి ఖన్నా థియేటర్ లో నవ్వులు పూయించింది, మళ్ళీ అలాంటి ఫన్నీ పాత్రలోనే ఈ చిత్రంలో నటిస్తుందని సమాచారం. తాజాగా ఈ రోజు సినిమా సెట్ లో హీరోయిన్ రాశి ఖన్నా జాయిన్ అయింది, ఈ మేరకు చిత్ర యూనిట్ సెట్ లో రాశి ఖన్నా నవ్వుతున్న ఒక ఫోటోను సోషల్ మీడియా లో వదిలారు. కాగా ఈ చిత్రం అక్టోబర్ 1, 2021 న విడుదల కానుంది.