‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ రిలీజ్ డేట్ !


ఆడియెన్స్ సినిమాలను చూసే ధోరణి మారిపోయింది. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు.

ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో అన్ని కారెక్టర్లను చూపించారు. పోస్టర్‌ ఎంతో ఇంటెన్స్ గా కనిపిస్తోంది. దర్శకుడు జైదీప్ విష్ణు ఈ సినిమాకు ఎడిటర్‌గానూ పని చేశారు. ఈ సినిమాకు సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేశారు.