రిపబ్లిక్ చిత్రాన్ని ‘జీ5’ ఓటీటీలో చూసిన సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ తాజాగా ‘జీ5’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ టైం లో తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రమోషన్ కార్య క్రమాలను పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరోలు చేసినప్పటికీ..కమర్షియల్ గా విజయం సాధించలేక పోయింది. ఈ తరుణంలో ఈ సినిమా ‘జీ5’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండడం తో చిత్ర యూనిట్ సినిమాను చూసి ఎంజాయ్ చేసారు.

చిత్ర దర్శకుడు దేవ కట్టా, స్క్రీన్‌ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఎఆర్, జీ స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలతో కలిసి సినిమా చూసిన సాయితేజ్.. వారితో సక్సెస్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలనుకున్న సాయితేజ్.. ఈ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసి.. అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

Firstly, Thank you all for the love you’re showering for #RepublicOnZee5.
This Friday remains very special for me as I have loved playing Panja Abhiram and yearned to watch with you all.
I am watching with team and happy to see you all joining in 🤗#Republic pic.twitter.com/DMgP573tGL— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 26, 2021