రామ్గోపాల్ వర్మ బాలీవుడ్ చూపు కంగనా రనౌత్పై పడింది. కంగనాపై ప్రశంసల జల్లు కురిపించారు వర్మ. కంగన టైటిల్ రోల్లో నటిస్తున్న ‘మణికర్ణిక’ సినిమా ట్రైలర్ను మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘లక్ష్మీబాయి అనే నేను.. నా శరీరంలో రక్తం ప్రవహిస్తున్నంత వరకు ఝాన్సీ రాజ్యాన్ని కాపాడతానని మాటిస్తున్నాను’ అంటూ విడుదలైన ఈ ట్రైలర్ చిత్రానికి మంచి స్పందన లభించింది.
ఈ ట్రైలర్ను ఉద్దేశించి వర్మ తాజాగా ట్వీట్ చేశారు. కంగన హావభావాలు, ఆమె చూపులోని కసి చివరిసారి ఎంటర్ది డ్రాగన్లోని బ్రూస్లీలో చూశానని అన్నారు. ‘కంగన ముందు పులులు కూడా పిల్లులు అయిపోతాయి. ఆమె కళ్లలోని ధైర్యం చూడకుండా.. చూపుతిప్పుకోలేకపోయా. ఇప్పటి వరకు నేను చూసిన అందరు హీరోల కంటే ఎక్కువ హీరోయిజం ఆమెలో కనిపించింది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు వర్మ.