మౌనమేలనోయి ఫేమ్ , వ్యాపారవేత్త సచిన్ జోషి కు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఆయన తాలూకా రూ. 410 కోట్ల ఆస్తులను జప్తు చేసారు. ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఆర్థిక నేరాలకు ఆయన పాల్పడ్డారనే కారణంతో మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల మేరకు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్కి చెందిన వైకింగ్ గ్రూపు కంపెనీలవి ఉన్నాయి. ఎస్ఆర్ఏ ప్రాజెక్ట్లో అక్రమాలు జరిగాయనే దానిపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగానే సచిన్ జోషి ఆస్తులను జప్తు చేశారు.
మౌనమేలనోయి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సచిన్ ఆ తర్వాత నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, ఆజాన్, జాక్పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్ చిత్రాలతో ఆకట్టుకున్నారు.