మహేష్ కు చెల్లెలుగా సాయి పల్లవి..?

లవ్ స్టోరీ , శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న సాయి పల్లవి..ఇప్పుడు మహేష్ మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే మహేష్ కు జోడి గా కాదు చెల్లెలుగా ఛాన్స్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘అతడు, ఖలేజా’ తర్వాత మహేశ్ బాబుతో చేయబోతున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా రూపొందనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.

హీరో చెల్లెలు పాత్ర సినిమాకి చాలా కీలకమట. అందుకే ఆ పాత్రలో సాయిపల్లవిని ఎంపిక చేయబోతున్నారని టాక్. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే మరో కథానాయికని కూడా ఎంపిక చేయబోతున్నారు. ఏప్రిల్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.