బాలీవుడ్‌ నటి సమీరా రెడ్డి కి కరోనా పాజిటివ్

నరసింహుడు చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన సమీరా రెడ్డి.. ఆ తర్వాత అశోక్ , జై చిరంజీవ , సూర్య సన్ అఫ్ కృష్ణన్ వంటి సినిమాలలో నటించి ఆకట్టుకుంది. కాకపోతే ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడం తో అమ్మడికి ఎక్కువగా అవకాశాలు దక్కలేదు. కానీ తమిళ్ , హిందీ లలో మాత్రం అమ్మడు మంచి విజయాలు అందుకుంది. ఆ తర్వాత 2014 లో అక్షయ్ వార్దేను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.

ప్రస్తుతం ఫామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. తన పిల్లలు కూడా కోవిడ్‌ లక్షణాలతో అస్వస్థతకు లోనయ్యారని, ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని.. సెకండ్‌ వేవ్‌ను నిర్లక్ష్యం చేయకుండా కరోనా‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.