సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అయిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఇటీవలే దుబాయ్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో మహేష్ బాబు ఈ రోజు నుండి జాయిన్ అవుతున్నాడు, ఈ మేరకు మహేష్ బాబు నిర్మాణ సంస్థ GMB ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. సర్కారు వారి పాట 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతోంది అంటూ ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు . ఇందులో మహేష్ ఒక ఆర్ధిక నేరస్తుడి పాత్ర చేస్తుండగా కీర్తి బ్యాంకు ఉద్యోగినిగా కన్పించనున్నట్లు సమాచారం. థమన్ సంగీతం సమకూర్చనున్నాడు.