సర్కారు రీ షూట్ వార్తల ఫై చిత్ర యూనిట్ క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటె ఈ మూవీ తాలూకా ఓ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పూర్తైన కొన్ని సీన్స్‌ను మళ్ళీ రీషూట్ చేస్తున్నారనే వార్తలు వైరల్ గా మారాయి.

దీంతో అభిమానులు సినిమా ఇప్పట్లో రిలీజ్ అవ్వడమే కష్టమేనా అని మాట్లాడుకోవడం..నిర్మాతలను అడగడం మొదలుపెట్టారు. దీంతో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అవన్నీ పుకార్లే నని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. మహేశ్ సొంత నిర్మాణ సంస్థతో కలిసి 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.